మహేష్ బాబు హీరోగా నటించి రేపు విడుదలకు సిద్ధమైన మహర్షి సినిమాకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రేపు మహర్షి చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు జరుపుతున్నారు. ఐటీ బృందం పలు రికార్డులని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలోను భారీ చిత్రాల రిలీజ్ సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.
కాగా, మహర్షి చిత్రం మహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కగా ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు భారీ బడ్జెట్తో నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు విలన్గా కనిపించనున్నాడు. మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం మే 9న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మహేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్.