తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’మానియా కొనసాగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’చిత్రంలో మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డే నటించింది. మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు.
ఈ చిత్రం ఇకర్ణాటకలో అయితే రికార్డు స్థాయిలో సుమారు 400 స్క్రీన్లపై రిలీజ్ అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో రూ. 150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క తెలుగు హక్కులే రూ. 100 కోట్లను సంపాదించి పెట్టాయి. దీన్ని బట్టి మహర్షి మానియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా... వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. రూ. 100 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.