సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా నటించిన చిత్రం  "మహర్షి" , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా "అల్లరి" నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, పివిపి ప్రసాద్, అశ్వినీ దత్ నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తందిగా మే 9 న విడుదలవుతోంది. 

అయితే ఈ చిత్రంతో పాటు మరో కొత్త సినిమా ట్రైలర్ ని కూడా జత చేస్తున్నారట, తేజ దర్శకత్వంలో  కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం "సీత". ఇటీవలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే మూడోవారంలో  విడుదల అవుతోంది. దీంతో ఈ చిత్ర ట్రైలర్ ని "మహర్షి" సినిమాతో ఆడ్ చేసిందిట చిత్రబృందం. 

జనరల్ గా "సీత" సినిమాకి పెద్దగా హైప్ లేదు, దీంతో ఈ సినిమాకి బాగా రీచ్ రావాలంటే "మహర్షి" మూవీ తో యాడ్ చేస్తే కలిసొస్తుందని ప్లాన్ చేసింది మూవీ యూనిట్. మరి "సీత" ఆశలని "మహర్షి" నిలబెడుతాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: