తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించిన సహజనటి జయసుధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో నటిస్తుంది. అప్పట్లో జయసుధ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత ఎక్కువగా శోభన్ బాబు, కృష్ణం రాజు లతో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలొ మాట్లాడుతూ..అప్పట్లో హీరోలు హీరోయిన్లను ఎంతో గౌరవంగా చూసేవారని..సెట్స్ లోకి వస్తే తమ కుటుంబ సభ్యుల్లా భావించేవారని ఏక్కడ కూడా ద్వందార్ధాలు పలికేవారు కారని అన్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు గురించి మాట్లాడుతూ..ఆయనది చాలా సున్నితమైన మనస్థత్వం అని..ఎంత సరదాగా మాట్లాడుతారని..సెట్స్ లోకి ఆయన వస్తే ఎంతో సందడిగా ఉంటుందని అన్నరు. అందరితోనూ ఆయన చాలా కలుపుగోలుగా వుంటారు. శోభన్ బాబు ఇప్పుడు షూటింగ్ కి వచ్చినా..అక్కడ ఉన్నవారికి చాక్ లెట్స్ తెచ్చేవారు..సహనటులకు అవి ఇస్తూ ఉండేవారు.
ఆయనతో నటించే చాలా మంది హీరోయిన్లు శోభన్ బాబుని తమ కుటుంబ సభ్యుడిగానే చూసుకునేవారు..తమ పర్సనల్ విషయాలు చెబుతూ...ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటుండేవారు. జీవితంలో మనం ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదనకు భవిష్యత్ లో పరమార్థం ఉండాలని చెప్పేవారు..దుబార ఖర్చులు జీవితాన్ని సర్వనాశనం చేస్తాయని సలహాలు ఇస్తుండేవారు. అందుకే శోభన్ బాబు అంటే హీరోయిన్లు అంతగా గౌరవించేవారని అన్నారు.