తెలుగులో వస్తున్న ఎంట్రటైన్ మెంట్ ప్రోగ్రామ్స్ లో ముఖ్యమైనది..అందరికీ ఇష్టమైనది ‘జబర్ధస్త్ కామెడీ షో’. ఈ ప్రోగ్రామ్ మొదలై దాదాపు ఆరు సంవత్సరాలు దాటుతుంది. ఇందులో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ బాలీవుడ్ స్టైల్లో  మిడ్డీస్,టైట్ డ్రెస్సులు వేసుకొని అసలు యాంకర్ అంటే ఇంత హాట్ గా ఉండాలని యాంకర్ అనే పదానికి కొత్త అర్థమే చెప్పింది.  అప్పటి నుంచి తెలుగులో చాలా మంది యాంకర్లు అనసూయనే ఫాలో అయ్యారంటే అతిశయోక్తి లేదు. 

యాంకర్ గా వచ్చిన కొద్ది రోజుల్లోనే అనసూయకు మంచి పాపులారిటీ రావడం..వెంటనే ఇతర ఛానల్స్ లోకి జంప్ కావడం జరిగింది.  అయితే కొన్ని కారణాల వల్ల మళ్లీ ఆమె జబర్ధస్త్ యాంకర్ గా కంటిన్యూ అవుతూ వస్తుంది. సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లోవచ్చిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.  అయితే అనసూయ యాంకర్ గా, నటిగా కన్నా సోషల్ మీడియాలో కాంట్రవర్సీలతో మరింత పాపులర్ అయ్యిందనే చెప్పొచ్చు. 

తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది యాంకర్ అనసూయ. అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ కి నేక్ మసాజ్ చేస్తుండగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫొటో తన కొడుకె తీసినట్లు ఆమె పేర్కొంది. అయితే ఈ ఫోటోలో అనసూయ వేసుకున్న డ్రెస్ పై సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.  నసూయకు నెటిజన్స్ నెగిటివ్ రియాక్షన్స్ కొత్తేమి కాదు కానీ ఈ ఫోటో చూసి కొంత మంది ఫాలోవర్స్ అయితే పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: