ఒకపక్క సినిమా రంగంలోనూ మరోపక్క యాడ్స్ రంగంలో దూసుకెళ్ళిపోతున్న మహేష్ బాబు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఇటీవల పెట్టడం జరిగింది. ఘట్టమనేని మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మించిన ఈ ప్రొడక్షన్ హౌస్ కి మహేష్ భార్య నమ్రత మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్నారూ. ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఈ బ్యానర్.. త్వరలోనే ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్.

Related image

గతంలో 'అర్జున్ రెడ్డి' సినిమా విజయం సాధించినప్పుడు ఆ సినిమా డైరెక్టర్ సందీప్ వంగా తో సినిమా ఉంటుందని ప్రకటించిన మహేష్ తర్వాత తాను ఒప్పుకున్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఇటీవల సందీప్ వంగా మహేష్ బాబు కి కథ చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా నటించబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినబడుతున్న టాక్.

Image result for mahesh babu vijay devarakonda

ఇందుమూలంగా నే ఇటీవల మహర్షి సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చారని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా కంప్లీట్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా మహేష్ తన తర్వాత సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: