సూపర్ స్టార్ మహేష్ తన 25వ సినిమా ఎలా ఉండాలని భావించాడో మహర్షి అందుకు తగినట్టుగానే ఉంది. ఈరోజు రిలీజ్ కాబోతున్న మహర్షి సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే షోస్ వేశారు. సినిమా గురించి మహేష్ ముందునుండి చెబుతున్నట్టుగానే ఓ మంచి కథతో సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది.


వంశీ పైడిపల్లి తన అద్భుతమైన కథతో మహేష్ ను మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చూపించారు. ముఖ్యంగా సినిమా కథకు తగినట్టుగా డైలాగ్స్ అదరగొట్టాయి. ఆలోచించే విధంగా ఉన్న డైలాగ్స్ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా చివర్లో గెలుపుని కోరుకునే వాడు మనిషి.. గెలుపుని పంచేవాడు మహర్షి అని రిషి అలియాస్ మహేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.


అంతేకాదు టీజర్ లో చెప్పినట్టుగా సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు అది మన జర్నీలో భాగం అవ్వాలనే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. ఇక రైతుల మీద మన చూపించాల్సింది జాలి కాదు అంటూ క్లైమాక్స్ లో మహేష్ చెప్పే డైలాగ్స్ థియేటర్ లో విజిల్స్ పడుతున్నాయి. సినిమా మొత్తం స్టాంగ్ కంటెంట్ తో తెరకెక్కించాడు వంశీ పైడిపల్లి. సినిమాలో మహేష్ నటనకు మరోసారి అతనెందుకు సూపర్ స్టార్ అయ్యాడన్నది తెలుస్తుంది.


పూజా హెగ్దె ఇంప్రెస్ చేయగా సినిమాలో అల్లరి నరేష్ రోల్ మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. కథల విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్న మహేష్ తన సినిమాలతో అటు కమర్షియాలిటీతో పాటుగా సోషల్ మెసేజ్ కూడా ఉండేలా చూస్తున్నాడు. రిషి జర్నీలో భాగమై రిషి మహర్షిగా ఎలా మారాడన్నది తెలుసుకోవాలంటే మీరు ఓసారి సినిమా చూస్తే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: