"నిధి అగర్వాల్"..ఈ హీరోయిన్ పేరు చెప్తే ఖచ్చితంగా ఏ ముంబాయ్ నుండో లేక ఢిల్లీ నుండో దిగింది అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. "నిధి" పక్కా హైదరాబాదీ అమ్మాయి. మార్వాడీ కుటుంబంలో పుట్టిన "నిధి అగర్వాల్" పెరిగిందంతా బెంగుళూరులో. అందుకే తెలుగు బాగా అర్థం చేసుకోగలుగుతుంది. స్క్రీన్ పైన చక్కగా పర్ఫార్మ్ చేయగలుగుతుంది. అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ మార్వాడి బ్యూటి తన అందం అభినయం తో ఆకట్టుకున్నప్పటికి సవ్యసాచి డిజాస్టర్ అవడంతో ఇక తెలుగులో అవకాశాలు రావనుకుంది. 


అయితే వెంటనే అక్కినేని హీరోతోనే రెండవ సినిమా చేసే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఆ సినిమానే "మిస్టర్ మజ్ను". అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో 
అఖిల్ కి జోడిగా ఆన్‌స్క్రీన్ రొమాన్స్ బాగానే చేసిందిగానీ, ఈ సినిమా కూడా "నిధి" కి ఫ్లాప్ ని తెచ్చిపెట్టింది. అయితేనేం "నిధి" కి రెండు ఫ్లాప్‌లు పడ్డా కూడా డైనమిక్ డైరెక్టర్ "పూరీ జగన్నాథ్" ఎనర్జిటిక్ హీరో రామ్ తో తీస్తున్న "ఇస్మార్ట్ శంకర్" లో హీరోయిన్ గా అవకాశాన్నిచ్చాడు. 


పూరీ సినిమా అంటే మాటలా..ఏ హీరోయిన్ కైనా పూరీ చేతిలో పడితే దశ దిశ మారిపోవాల్సిందే. హీరోయిన్ ని వెండితెర మీద అంత అద్భుతంగా చూపిస్తారు. ఈ ఒక్క సినిమా హిట్టు పడితే చాలు నిధి టాలీవుడ్ లో సెటిలైపోతుంది. అయితే గత కొంతకాలంగా అటు పూరీకి కానీ, ఇటు ఇస్మార్ట్ శంకర్ (రామ్) కి కానీ సరైన హిట్టు లేక అల్లాడుతున్నారు. మరి ఈ సారైనా ఈ "ఇస్మార్ట్ హీరోయిన్" కి టాలీవుడ్ లో హిట్టు పడుతుందో లేదో "ఇస్మార్ట్ శంకర్" రిలీజైతే గానీ తెలీదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: