ఈరోజు విడుదలైన ‘మహర్షి’ కి పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ విషయంలో సునామీలను సృష్టించడానికి ఈమూవీ నిడివి ప్రతిబంధకంగా మారుతుందా అన్న సందేహాలను ఏకంగా మహేష్ అభిమానులే వ్యక్తం చేస్తున్నారు. ఈమూవీకి సంబంధించి ప్రీమియర్ షోలతో పాటు మార్నింగ్ షోలు కూడ పూర్తి కావడంతో ఈమూవీ టాక్ పూర్తిగా బయటకు వచ్చేసింది.

ఈసినిమా బాగుంది అంటూ సగటు ప్రేక్షకుడు తీర్పు ఇచ్చినా ఈమూవీ నిడివి మూడుగంటలు కాకుండా రెండున్నర గంటలకు కుదించి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాలు సగటు ప్రేక్షకుడు వ్యక్త పరుస్తున్నాడు. ఈవిషయాలు మహేష్ అభిమానుల దృష్టికి రావడంతో ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల ‘మహర్షి’ హిట్ టాక్ తెచ్చుకుని కూడ బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఆగిపోతుందా అన్న సందేహాలు అభిమానులకు కలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈమూవీ సెకండ్ ఆఫ్ మరీ పెద్దదిగా అనిపించింది అన్న అభిప్రాయం మహేష్ అభిమానులకు కూడ ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈసినిమా కథకు మూడు గంటల నిడివి అనవసరం అనీ వంశీ పైడిపల్లి కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఈసినిమాను రెండున్నర గంటలలో పూర్తి అయ్యేలా తీయవచ్చనీ మహేష్ అభిమానులు కూడ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే సబ్జెక్ట్ డిమాండ్ చేసింది కాబట్టి ఈసినిమాకు ఇంత నిడివి అవసరం అనీ మొదటి నుంచి వంశీ పైడిపల్లి వాదిస్తున్నాడు. వాస్తవానికి ఈసినిమా మూడున్నర గంటల నిడివితో తయారు అయితే వంశీ పైడిపల్లి చాల కష్టపడి ఈసినిమాను మూడు గంటలకు కుదించాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. దీనితో ‘మహర్షి’ నిడివి ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కు ఎంతవరకు ప్రతిబంధకంగా మారుతుంది అన్న విషయం ఈ వీకండ్ తరువాత మాత్రమే మహర్షి కలక్షన్స్ ను బట్టి  అవగాహనకు వస్తుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: