వంశిం పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డె నటించిన ‘మహర్షి’సినిమా నేడు విడుదలైంది.  ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  అమెరికన్ బేసెడ్ అరిజన్ కంపెనీ అధినేత  రుషి కుమార్ (మ‌హేష్ బాబు)కు ఓటమి అంటే ఇష్టం ఉండదు. ఓటమి అంటే భయంతో అతను ఎప్పుడూ గెలుపు కోసం ప్రయత్నిస్తూ  బిజినెస్ లో దూసుకుపోతూంటాడు.
 
ఈ సినిమాలో హీరోకి గెలుపు తప్ప ఓటమి ఎరుగడు...ఓటమి అంటే భయం..ఎందుకంటే..అది మనజీవితాలను ఏ లక్ష్యం లేకుండా చేస్తుందనే స్వభావంతో ఉంటాడు.  అలాంటి సంపన్నుడు భారత దేశానికి వచ్చి గోదావరి జిల్లా రామవరం గ్రామంలో సామాన్య రైతు అవతారం ఎందుకు ఎత్తాడు..తర్వాత రైతుల గౌరవ స్థానాన్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడు..కార్పోరేట్ యాజమాన్యం..వారికి తానా తందానా అనే పొలిటికల్ లీడర్స్ ని ఎలా ఎదింరించారు..అన్న కాన్సెప్ట్ తో వంశి పైడిపల్లి...మహేష్ ని మరోయాంగిల్ లో అవిష్కరించారు ఈ సినిమాలో.. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడని అంటున్నారు పబ్లిక్.  


మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్న విషయం తెలిసిందే.  కాస్త ఆలస్యం అయినా మహేష్ అభిమానులకు మంచి సినిమా అందించారని..ఈ సంవత్సరం టాప్ సినిమాల్లో మహర్షి నిలవడం ఖాయమని అంటున్నారు హార్డ్ కోర్ అభిమానులు.  ఇప్పటికే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా బీభత్సంగా ఉంది..అందులోనూ హిట్ టాక్ వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు.  మరోవైపు ఈ సినిమాపై పబ్లిక్ టాక్ కూడా బాగా రావడంతో..కలెక్షన్ల పంట పండుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: