తన తండ్రి నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధించిన రెండు బయోపిక్ లు తెరకెక్కించారు బాలకృష్ణ. రామారావు రాజకీయ జీవితం గురించి మరియు సినిమా రంగం గురించి తీసిన రెండు సినిమాలు ఇటీవల విడుదలయ్యాయి దారుణంగా ఫ్లాప్ అవటం జరిగాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఈసారి కచ్చితంగా షార్ట్ టైమ్ లోనే పెద్ద హిట్టు కొట్టాలని కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో బాలకృష్ణ తాజాగా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
త్వరలోనే అనగా మే 17వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలకృష్ణ కి ప్రతికూల పాత్రలో ఒక సంచలన నటి నటిస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ సినిమాలో కీ రోల్ చేయనుంది. నెగిటివ్ పాత్రలో ఆమెను చూపించనున్నారు.
మరో ప్రక్క జగపతిబాబును మెయిన్ విలన్ గా ఎంపిక చేసారని తెలుస్తోంది. ఇందులో విలన్ రోల్ చాలా పవర్ఫుల్గా వుంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా హరిప్రియను తీసుకున్నారని చెప్తున్నారు. హరిప్రియ, బాలయ్య ఇంతకు ముందు జయసింహ చిత్రంలో కనిపించారు. అన్ని పద్దతి ప్రకారం జరిగితే వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలన్నది సినిమా యూనిట్ ప్లాన్.