వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మహర్షి". సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా, కామెడీ హీరో "అల్లరి నరేష్" ప్రధాన పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు.  "అరవింద సమేత వీర రాఘవ" సినిమాతో తన ఖాతలో హిట్ ని వేసుకున్న పూజా మహర్షి సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది. 


ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతలో పడటం ఖాయమని కాన్‌ఫిడెంట్‌గా ఉంది. మహేష్, పూజా, నరెష్ క్యారెక్టర్స్‌కి ఈక్వల్ ఇంపార్టెంట్స్ ఉందని ముందు నుంచి ప్రేక్షకులు భావించారు. అయితే సినిమా రిలీజైయ్యాక మాత్రం "మహర్షి" వన్ మ్యాన్ షో అని తేలిపోయింది. కథ మొత్తం "రిషి" చుట్టే తిరగడంతో పూజకి అంతగా యాక్టింగ్ స్కోప్ లేకుండా పోయిందట. అంతేకాదు కాస్తో కూస్తో నరేష్ క్యారెక్టరే బెటరని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు.  


పూజా హెగ్డే.. కాలేజీ సీన్స్, విలేజ్ సీన్స్ లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసినప్పటికి థియోటర్స్ నుండి బయటకు వచ్చాక అవేవి గుర్తుండవట. అందుకే ఈ సినిమాలో "పూజ" పాటలకే పరిమితం అని అంటున్నారు. ఏదేమైనప్పటికి మహేష్, నరేష్, పూజ కాంబినేషన్ లో వచ్చే కాలేజ్ సీన్స్ ని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారట. ఇప్పటికే హిట్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డ్‌లను క్రియోట్ చేస్తుందో చూడాలి.      


మరింత సమాచారం తెలుసుకోండి: