దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. కానీ పేరున్న నటులు ఎలా ఉండాలో ఆలా ఉన్నకున్నప్పుడు విమర్శలు వస్తాయి. కొద్దిరోజుల కిందట కారు దిగుతూ ఉన్న ఫొటోను రకుల్ పోస్టు చేయడం సంచలనం అయింది. ఈ పిక్ లో ఆమె టాప్ మాత్రమే ధరించినట్లు కనిపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అంతేకాదు ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆమె వాల్ లోకి వెళ్లి ఘోరమైన కామెంట్లు చేశారు. వీరిలో ఓ నెటిజన్ ఏకంగా రకుల్ ను బూతులు తిట్టాడు.


ఇక తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా పోస్టు చేసిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో తన భర్త కింద కూర్చుని ఉండగా ఆమె కుర్చీలో ఉండి అతడికి మసాజ్ చేస్తోంది. మసాజ్ చేయడం పెద్ద విషయం కాకపోయినా.. ఆ ఫొటోలో ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం దారుణంగా ఉంది. ఈమె కూడా రకుల్ లా టాప్ ఒక్కటే వేసుకున్నట్లు ఈ ఫొటోలో కనిపించింది.


ఈ ఫొటోలో అనసూయ థైస్ దర్శనమిస్తుండడంతో ఆమెపైనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బూతులతో కూడిన కామెంట్లు పెడుతున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఎవరి వ్యక్తిగత జీవితం వారిది.. ఎవరి ఇష్టాలు వారివి. కానీ ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని దాటితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. కాబట్టి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏమైనా పోస్టులు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది. తమకు నచ్చిన దానిని సమాజం అంగీకరిస్తుందా..? లేదా..? అన్నది కూడా ఆలోచించగలిగితేనే ఎక్కడైనా నెగ్గుకు రాగలం. 

మరింత సమాచారం తెలుసుకోండి: