సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన 25వ సినిమాగా తెర‌కెక్కిన మ‌హ‌ర్షి సినిమా ఈ రోజు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజునే చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రు అయిన పీవీపీ మ‌హేష్‌కు తాను చెప్పిన బ్యాడ్ న్యూస్ గురించి చెప్పారు. ఈ రోజు సినిమా రిలీజ్ అవుతోన్న సంద‌ర్భంగా పీవీపీ విజ‌య‌వాడ‌లోని త‌న సొంత థియేట‌ర్ పీవీపీ మాల్ లో సాధారణ ఆడియన్స్, మ‌హేష్ అభిమానుల‌తో క‌లిసి ఈ సినిమా వీక్షించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వారం కింద‌ట మ‌హ‌ర్షి సినిమాను తాను తొలిసారిగా చూశాన‌ని... అప్పుడే మ‌హేష్‌కు ఫోన్ చేసి మీకు బ్యాడ్ న్యూస్ అన‌గానే మ‌హేష్ ఎంతో కంగారుప‌డిపోయార‌న్న విష‌యం చెప్పారు.


తాను బ్యాడ్ న్యూస్ అని చెప్ప‌గానే మ‌మేష్ ఒకింత ఆందోళ‌న‌తో బ్యాడ్ న్యూస్ అంటున్నారేంటి అని అడ‌గ‌గానే అందుకు తాను ఈ సినిమాను మించిన హిట్‌ను మీరు ఎప్ప‌ట‌కీ కొట్ట‌లేర‌ని... అదే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పానని పీవీపీ వివరించారు. మ‌హ‌ర్షి సినిమా మీ కెరీర్‌లోనే తిరుగులేన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అని చెప్ప‌డంతో మ‌హేష్ పెద్ద రిలీఫ్‌గా ఫీల‌య్యార‌ని పీవీపీ చెప్పారు.


ఇక శ్రీమంతుడు సినిమా త‌ర్వాత పీవీపీ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో బ్ర‌హ్మోత్స‌వం సినిమా చేయ‌గా అది డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ త‌ర్వాత పీవీపీకి మ‌హేష్ ఇచ్చిన క‌మిట్‌మెంట్‌తోనే ఇప్పుడు మ‌హ‌ర్షిలో వాటా ఇచ్చాడు. ఇక సైనికుడు త‌ర్వాత అశ్వ‌నీద‌త్‌కు ఇచ్చిన క‌మిట్‌మెంట్‌ను సైతం ఇప్పుడు ఈ సినిమాతో పూర్తి చేసేశాడు. ఏదేమైనా సినిమా బాగా ల్యాగ్ అయ్యింద‌న్న మేజర్ కంప్లైంట్ మిన‌హా సినిమాకు పాజిటివ్ టాకే వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: