ఒక లైలా కోసం, ముకుందా చిత్రాలతో పెద్దగా పేరు రాకపోవడంతో బాలీవుడ్ జంప్ అయ్యింది హాట్ బ్యూటీ పూజా హెగ్డే.  కొంత కాలం తర్వాత మళ్లీ తెలుగు చిత్రాలవైపు మొగ్గు చూపింది..ఇదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’చిత్రం లో తన అందాలన్నీ ఆరబోసింది.  దాంతో ఈమెపై దర్శక, నిర్మాతల కళ్లు పడ్డాయి.  అప్పటి నుంచి వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది పూజా హెగ్డె.  


ఈ మద్య హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ‘వాల్మీకి’సినిమా కోసం 15 రోజులకు రెండు కోట్లు డిమాండ్ చేసిందని..వార్తలు వచ్చాయి.  అలాంటిది ఏమీ లేదని ఇప్పటి వరకు ఆమె ను సంప్రదించలేదని డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.  ఈ మద్య హైదరాబాద్ లో ‘మహర్షి’ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత  పూజా హెగ్డే, ఆమె మేనేజర్ ఓ 7 స్టార్ హోటల్ కు వెళ్లారట.  ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. పూజా పూజా హెగ్డే ప్రయాణిస్తున్న కారుని పోలీసులు సీజ్ చేసినట్లు ప్రచారం జరిగింది. 

కాగా, ఈ కేసు లో ఆమె మేనేజర్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి.  దాంతో పూజా హెగ్డె..ఆమె మేనేజర్ ఆశ్చర్యపోయారు..అలాంటి సంఘటనే జరగలేదు..తనపై పోలీసులు ఎలా కేసు పెడతారని..ఇవన్నీ ఒట్టి రూమర్లే అని..ఇలాంటి పుకార్లు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: