ఈ మద్య టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  కొన్ని సినిమాలైతే డబ్బింగ్ తో పనికానిచ్చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో నేడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డె జంటగా నటించిన ‘మహర్షి’సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే పెట్టుకున్నారు.  అంతే కాదు ఇది మహేస్ బాబు కి 25వ సినిమా కావడం..తప్పకుండా హిట్ కావాలనే కాంక్ష ఉండటం మరో విశేషం. 

మొత్తానికి నేడు రిలీజ్ అయిన ‘మహర్షి’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ వచ్చింది.  ఈ సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ లో కనిపించాడట..స్టూడెంట్, కార్పోరేట్ బిజినెస్ మాన్, రైతు ఈ పాత్రలో కపిపించి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారట.  ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లు ఆసక్తికరంగా అనిపించడంతో సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట సల్మాన్ ఖాన్. 


అయితే ఈ సినిమాను  నిర్మాత దిల్ రాజు.. బోనీకపూర్ తో కలిసి బాలీవుడ్ లో ఈ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.   ఇప్పటికే ఈ కాంబినేషన్ లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’మూవి రిమేక్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో  సల్మాన్ ఖాన్ తో కూడా 'మహర్షి' రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో సల్మాన్ ఖాన్ కోసం సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: