ఈ మద్య వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటుడి ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు అందరితో ఆనందంగా ఆడుతూ..పాడుతు ఉన్న చిన్నారి క్షణాల్లో కన్నుమూసి వేయడం అందరి హృదయాలు కలచి వేసింది. అందరూ చూస్తుండగానే తమ పాప కళ్ళు మూయడం బాలీవుడ్ లో అందరిని షాక్ కి గురిచేసింది.
బాలీవుడ్ లో ప్రముఖ బుల్లితెర నటుడు ప్రతీష్ వోరా కూతురు ఒక చిన్న బొమ్మతో సరదాగా ఆడుకుంటూ ఉండగా కొన్ని నిమిషాలకే ఊపిరాడక మరణించింది. అయితే పాప నోట్లో ప్లాస్టీక్ పెట్టుకోవడం..అది కాస్త గొంతులో ఇరికి ఊపిరాడక పోవడం..ఆసమయంలో పాపను చూడకపోవడంతో క్షణాల్లో ఊపిరి ఆడక ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరణించింది.
కాగా, ప్రతీష్ ‘ప్యార్ కే పాపడ్’ అనే టీవీ (స్టార్ భారత్) షోలో నటిస్తున్నారు. ఈ విషయం తెలియగానే గుండె పగిలినంత పనైందట.ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు,.కొంత మంది టివి నటీనటులు ప్రతిష్ కూతురిని ఆఖరి సారి చూసేందుకు వారి ఇంటికి చేరుకున్నారు.