తేజ దర్శకత్వంలో వస్తున్న “సీతా” సినిమా మహర్షి సినిమా తో అడుగులు వేయనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ జంటగా రాబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి సినిమాలతో ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అల్లుడు శీను గా ప్రేక్షకుల మన్ననలు పొంది “జయ జానకి నాయక” లాంటి బ్లాక్ బస్టర్ తో తనదైన ముద్ర వేసుకున్నాడు.


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “సీతా” సినిమా ఈ నెల 24వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ అండ్ యాక్షన్ కలయికలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇదిలా ఉండగా ఈ చిత్రం లేటెస్ట్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “మహర్షి” తో పాటు థియేటర్ లో ప్లే చేద్దామని ప్లాన్ చేసినట్లు గా తెలుస్తుంది.

Image result for maharshi images

ట్రైలర్ కి ముందు “సీతా” సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక కొత్త షేడ్ లో కనిపించనున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాను ఏ.కే ఎంటర్టైన్మేంట్ బ్యానర్ పై , అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనుప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.


ఈ సినిమాలో మన్నార చోప్రా, సోను సూద్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పాయల్ రాజ్ పుట్ ఐటెం సాంగ్ లో అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో ఉంది త్వరలో మన ముందుకు రాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: