వేసవిని టార్గెట్ చేస్తూ మహేష్ బాబు తన 25వ సినిమా మహర్షి ని విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు మొట్టమొదటి షో పడగానే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా దుమ్ము దులిపే కలెక్షన్లతో దూసుకెళ్ళిపోతున్నది.

Image result for maharshi

ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన పీవీపీ మన సొంత ఊరు విజయవాడలో ప్రేక్షకులతో కలిసి మహర్షి సినిమా చూడటం జరిగింది. అయితే సినిమా చూసిన తర్వాత పీవీపీ మీడియాతో మాట్లాడుతూ..మహేష్ పై సంచలన కరమైన కామెంట్లు చేశారు. పీవీపీ మాట్లాడుతూ.. వారం క్రితమే తాను మహర్షి చిత్రం చూశానని అన్నారు. వెంటనే మహేష్ బాబుకు ఫోన్ చేసి మీకు ఓ బ్యాడ్ న్యూస్ అని చెప్పా.

Image result for maharshi

దీనితో మహేష్ కాస్త కంగారుగా ఏమైంది అని అడిగారు. కంగారు పడాల్సిందేమి లేదు అని మహర్షి చిత్రం గురించి చెప్పా. మహర్షి చిత్రానికి మించిన హిట్ మీరు కొట్టలేరు.. అదే మీకు బ్యాడ్ న్యూస్ అని మహేష్ కు తెలిపా. మహర్షి చిత్రం మీ కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పగానే మహేష్ సంతోషపడ్డారు. దాదాపు మూడేళ్ళ క్రితమే మహర్షి చిత్రానికి బీజం పడిందని పీవీపీ తెలిపారు. ఆ  తర్వాత దిల్ రాజు, అశ్విని దత్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సమైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: