గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో  దూకుడు, ఆగడు సినిమాలు చేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇదిలావుండగా తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో సోషల్ మీడియాలోనూ ఇండస్ట్రీలోనూ మహేష్ బాబు సన్నిహితులు ఎంతగానో సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

Related image

ఇటువంటి తరుణంలో మహర్షి సినిమాపై ఎవరు ఊహించని కామెంట్లు ట్విట్టర్ లో చేశారు డైరెక్టర్ శ్రీనువైట్ల. ట్విట్టర్లో శ్రీనువైట్ల ఈ విధంగా స్పందించారు..‘మహర్షి’ చిత్రం చూశాను. ఒక సీఈవో‌గా, రైతుగా, స్టూడెంట్ గా మహేశ్ నటన చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్టూడెంట్ పాత్రలో మహేశ్ బాబు లుక్, ఎనర్జీ చాలా కొత్తగా ఉంది. అదే విధంగా అల్లరి నరేశ్ నటన కూడా గుండెలకు హత్తుకునేలా ఉంది.

Image result for maharshi

దర్శకుడు వంశీ నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే శ్రీను వైట్ల రైతుల గురించి మాట్లాడుతూ.. రైతులకు మన సానుభూతి అవసరం లేదు. వాళ్లను గౌరవిస్తే వాళ్లు మనల్ని సొంతవాళ్లుగా చూస్తారు’ అని శ్రీను వైట్ల పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో పక్క తన కెరియర్లో 25వ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మహేష్ బాబు కూడా ఈ సినిమా సక్సెస్ ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకి వస్తున్న కలెక్షన్లు ఆదరణ చూస్తుంటే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు సినిమా విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: