టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు మహర్షి గురువారం భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకుకుంటుంది. సినిమా బాగా ల్యాగ్ అయ్యిందన్న మేజర్ కంప్లెంట్ మినహాయిస్తే సినిమాకు యావరేజ్ టాక్ ఉంది. సోలో రిలీజ్ కూడా మహర్షికి బాగా కలిసొచ్చింది. ఇక ఈ సినిమా మూడు ఏరియాల్లో తొలి రోజు వసూళ్లలో నాన్ బాహుబలి రికార్డులను క్రాస్ చేసింది.
నైజాంలో అయితే బాహుబలి 1 రికార్డులను సైతం దాటేసి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. మహర్షి తొలి రోజు నైజాం ,గుంటూరు , కృష్ణా లో భారీ వసూళ్లను రాబట్టి నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. యావరేజ్ టాక్తోనే మహేష్ బాహుబలిని బీట్ చేశాడంటే.. ఇక హిట్ టాక్ వస్తే పరిస్థితి ఏ రేంజ్లో ఉండేదో ? ఊహించుకోవచ్చు. నైజాంలో తొలి రోజు మహర్షి రూ 6.38 కోట్లు రాబట్టి బాహుబలి 1 ( రూ 6.289 కోట్లు)ను బీట్ చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇక బాహుబలి 2 రూ 8.92 కోట్లతో తొలి స్థానంలో ఉంది.
ఇక గుంటూరులో రూ 4.40 కోట్లు రాబట్టి ఈ సంక్రాంతికి వచ్చిన చెర్రీ వినయ విధేయ రామ రూ 4.1 కోట్ల రికార్డు బీట్ చేసింది. ఇక కృష్ణాలో 1.39 కోట్లతో భరత్ అనే నేను రూ 1.31 కోట్లను క్రాస్ చేసేసింది. ఏదేమైనా యావరేజ్ టాక్తోనే కృష్ణా, గుంటూరు, నైజాంలో కొత్త రికార్డులు రాయడంతో పాటు నైజాంలో బాహుబలి 1ను సైతం క్రాస్ చేయడం గొప్ప విషయమే. మరి ఈ టాక్తో మహర్షి బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు లాంగ్ జర్నీ చేస్తుందనే దానిమీదే ఆ సినిమా కొత్త రికార్డులు ఆధారపడి ఉన్నాయి.