పుత్రోత్సాహం ఆ పుత్రుడు పుట్టినపుడు కాదు..అతడు ప్రయోజకుడైనపుడు అంటారు..ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు ని చూస్తుంటే..సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇదే మాట అంటున్నారు..మహేష్ ఈజ్ ద బెస్ట్.  సూపర్ స్టార్ కృష్ణ తనయులు రమేష్ బాబు, మహేస్ బాబు ఇద్దరూ బాలనటులుగా ప్రవేశించి..రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. 

ఆ తర్వాత నిర్మాణ రంగం వైపు వెళ్లారు.  బాలనటుడిగా వచ్చిన మహేష్ బాబు తన తండ్రి తో కొన్ని సినిమాల్లో నటించి అప్పుడు ఉత్తమ బాలనటుడిగా పేరు తెచ్చుకున్నాడు.  రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో హీరోగా తన పరిచయం అయి ఇప్పటి వరకు 25 సినిమాల్లో నటించారు.  
వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు 25వ సినిమా ‘మహర్షి’.

ఈ సినిమాలో మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు.  తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్ సెలబ్రెటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  మరోవైపు మహేష్ బాబు నటన కు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో   సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులతో కలసి ఈ మూవీని వీక్షించారు.

విజయనిర్మల, నరేశ్ లతో పాటు ఇతర కుటుంబసభ్యులతో కలసి సినిమా చూశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థిగా, వ్యాపారవేత్తగా, రైతుగా మూడు పాత్రల్లో మహేశ్ నటన అదిరిపోయిందని తెలిపారు. అందుకే మహేష్ ది బెస్ట్ అని అంటున్నా అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: