జగన్ సీఎం అవుతారని అంతా అనుకుంటున్నారు. అయితే అయనకు ఏకంగా ఎదురు లేదని, నాలుగు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగానే ఉంటారని తెలుగు సినీ నటి ఒకరు తన అభిప్రాయం చెబుతున్నారు. జగన్ తెలివైన రాజకీయ నేత మాత్రమే కాదని, మానవత్వం ఉన్న నాయకుడని ఆమె అంటున్నారు. జగన్ జాతీయ రాజకీయాల్లో సైతం రాణిస్తారని అంటున్నారు.


ఆమె ఎవరో కాదు విశాఖ జిల్లాకు చెందిన నటి రమ్యశ్రీ. వైసీపీలో చేరి ఈసారి ఎన్నికల్లో ప్రచారం కూడా చేసిన ఆమె తప్పకుండా జగన్ అధికారంలోకి వస్తారని ధీమాగా చెబుతున్నారు. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ,  జగన్ ప్రజల మనిషి అని కొనియాడారు. ఆయనకు దివంగత నేతలు అన్న నందమూరి, వైఎస్సార్ లకు ఉన్నంత క్రేజ్ ఉందని చెప్పారు.


జగన్ ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆయన  తనకు తానుగా దిగిపోవాలి తప్ప ఎవరూ ఢీ కొట్టే పరిస్థితే ఉండదని కూడా రమ్యశ్రీ అంటున్నారు. జగన్ తన తండ్రి లాగానే తిరుగులేని ప్రజా  పాలనను అందిస్తారని కూడా చెప్పారు. జగన్ పట్ల ఏపీ ప్రజలు కూడా ఎంతో అభిమానం చూపించారని, ఆయన్ని  గొప్ప మెజరిటీతో గెలిపిస్తారని  కూడా రమ్యశ్రీ అన్నారు. మరి చూడాలి ఆమె మాటలు ఎంతవరకూ నిజమవుతాయో 23న ఫలితాలు తరువాత.


మరింత సమాచారం తెలుసుకోండి: