శ్రీకాంత్ అడ్డాల పేరు చెబితే ఎవరికైనా "బ్రహ్మోత్సవం" సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ కాబట్టి. ఈ సినిమా నుండి కోలుకోవడానికి మహేష్ కి చాలా సమయమే పట్టింది. ఎందుకంటే మహేష్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడూసర్ కాబట్టి. అటు హీరోగా , ఇటు నిర్మాతగా రెండు విధాలా మహేష్ కి ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అంతేకాదు  శ్రీకాంత్ అడ్డాల కు కూడా పెద్ద షాకే అని చెప్పాలి. 


ఇక్కడ ఎవరికైనా సక్ససే ఇంపార్టెంట్. ఎన్ని హిట్స్ ఇచ్చినా, ఎన్ని రాకార్డ్‌లు బద్దలు కొట్టినా ఒక్క ఫ్లాప్ పడితే మళ్ళీ అవకాశం ఇవ్వడానికి ఎవ్వరు దగ్గరికిరారు. కానీ వరుస సినిమాలతో హిట్స్ కొడుతున్న నానీ మాత్రం ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడట. కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి క్లాస్ హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల నానీకి అద్భుతమైన కథ చెప్పాడట. నానీకి కథ నచ్చితే చాలు ఆ డైరెక్టర్ ఫ్లాప్‌లు తీశాడా..హిట్స్ తీశాడా అని ఆలోచించడు...వెంటనే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అందుకే నానీ నేచురల్ స్టార్ అయ్యాడు.


ఇక ఫ్యామిలీ చిత్రాలతో తనకంటు ఒక గుర్తింపు ఉన్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి నాని ఓకే చెప్పారని తెలుస్తోంది.  ఈ సినిమాని 
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారని సమాచారం.  ప్రస్తుతం నానీ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో గ్యాంగ్ లీడర్, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వీ` సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నానీ- శ్రీకాంత్‌ల సినిమా మొదలవుతుందని లేటెస్ట్ అప్‌డేట్.


మరింత సమాచారం తెలుసుకోండి: