టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా సైరా. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగా పవర్ స్టార్ రాం చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ప్రపంచ స్థాయిలో ఉన్న రికార్డులన్నిటిని బద్దలు కొట్టేలా తీర్చి దిద్దుతున్నారు. మొదటి భారత స్వాతంత్ర సమర యోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా రికార్డులను తిరగరాయబోతున్నారు.
 
అంతే కాదు ఇద్దరు మెగా స్టార్స్ ఈ సినిమాలో వెండి తెరమీద ఒకే ఫ్రేం లో కనబడబోతున్నారంటేనే ఆ క్షణం కోసం కొన్ని కోట్ల మంది కళ్ళు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. అటు బాలీవుడ్ మెగా స్టార్, ఇటు టాలీవుడ్ మెగాస్టార్ కలిసి యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపబోతున్నారు. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో అధ్బుతంగా తీర్చి దిద్దుతున్నాడని సమాచారం. ఇక బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ మొదటి సారి మెగా స్టార్ చిరంజీవి తో కలిసి నటించడంతో అంచనాలకు హద్దే లేకుండా పోయింది. 


ఇక పరుచూరి బ్రదర్స్ అందించిన కథ, సాయి మాధవ్ బుర్రా పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాని ఏ స్థాయికి తీసుకు వెళతాయో ఊహించడమే కష్టం. విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 2019 అక్టోబర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది.       


మరింత సమాచారం తెలుసుకోండి: