శ్రీను వైట్ల పేరు చెబితే ఆనందం, ఢీ, రెడీ, దుబాయ్ శీను, అందరివాడు, కింగ్, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. ఒకప్పుడు శ్రీను వైట్ల కోసం నిర్మాతలు క్యూ లో నించునే వారు. తన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్ని వరుస బెట్టి మంచి కమర్షియల్ సక్సస్ ను సాధిస్తూ బాక్సాఫీస్ లు బద్దలు కొడుతుండేవి. ముఖ్యంగా శ్రీను సినిమాలలో కామెడీ అయితే ఒక బ్రాండ్ అయిపోయింది. కామెడీ ట్రాక్ ని అంత అద్భుతంగా తెరకెక్కించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు. అందుకు ఉదాహరణ "ఒక్క సినిమా" అని కూడా చెప్పలేము. ఎందుకంటే తన ప్రతీ సినిమాలో అన్నీ ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా పీక్స్ లో ఉంటుంది. 


అలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లిచ్చిన శ్రీను వైట్ల వరుస డిజాస్టర్లను ఇచ్చాడు. స్టార్స్ తో తీసిన ప్రతీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుండటంతో శ్రీను గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అయినప్పటికి శ్రీనుతో ఉన్న అనుబంధంతో మాస్ మహారాజ రవితేజ ఎంతో నమ్మి హిట్టిస్తాడన్న గట్టి నమ్మకంతో "అమర్ అక్బర్ ఆంటో"ని సినిమాకు డేట్స్ ఇచ్చాడు. పాపం ఇలియానా కూడా శ్రీనుకి సపోర్ట్ చేసి రీ ఎంట్రీ ఇస్తూ సినిమా కమిటైంది. అయితే "అమర్ అక్బర్ ఆంటోని" శ్రీనుకే కాదు రవితేజ-ఇలియానా కి షాకిచ్చింది. 


దాంతో శ్రీనుకి ఇంకో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ రానేలేదు. ఇలా అవకాశాల కోసం ఎదురు చూడటం ఎంతకాలం అనుకున్నడో ఏమోగాని మనకు ఓ సొంత బిజినెస్ ఉంటే బెటరని డిసైడైయ్యాడట. ఆల్రెడి శ్రీను భార్య "రూప వైట్ల" సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తుంటారు. ఈమె సినిమా రంగానికే పరిమితం కాకుండా మిల్క్ ప్రొడక్ట్స్ బిజినెస్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు త‌న వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నార‌ట రూప వైట్ల‌. ఇప్ప‌టి వ‌ర‌కు "వైట్లాస్ వేదిక్" అనే పేరుతో మిల్క్ ప్రొడ‌క్ట్స్ బిజినెస్ చేసిన రూప వాటితో పాటు ఇప్పుడు "వేదిక్" పేరుతో హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ అమ్మబోతున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: