యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'. 'అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి' ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ చిత్రం మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. చిత్రానికి క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. 

ఈ చిత్రాన్ని మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లై టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక యంగ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ పాడిన `మెల్ల‌మెల్ల‌గా ..` సాంగ్ అన్నీ ఫ్లాట్‌ఫామ్స్‌లో 25 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్ట‌కుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 


ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అమెరికా నుండి ఇండియా వ‌చ్చిన ఎన్నారై పాత్ర‌లో అల్లు శిరీష్‌, అత‌ని స్నేహితుడి భ‌ర‌త్ న‌ట‌న చిత్రం ఆసాంతం మెప్పించ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: