రకుల్ ప్రీతీ సింగ్ ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీగా మారిపోయింది. అప్పట్లో ఫెయిల్యూర్స్ పలకరించడంతో ఢీలా పడ్డా, ఇప్పుడు గాడిలో పడినట్లుంది. ప్రస్తుతం దే దే ప్యార్ దే సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే... కష్టపడి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. పనిని నేను ఆస్వాదిస్తాను.


వర్క్‌ను నేను ఎంతగా ఇష్టపడుతానంటే.. 30 గంటలపాటు అలుపుసొలుపు లేకుండా ఏకధాటిగా పనిచేయగలను. ప్రతిభావంతులతో పనిచేయాలని ఎప్పుడూ కోరుకొంటాను. అలాంటి వారి నుంచి కూడా ఇదే విధంగా ఆశిస్తాను. నాలో ప్రతిభను గుర్తించే వారి కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను అని రకుల్ అన్నారు. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది.


వారిలోని టాలెంట్‌ను దగ్గర నుంచి చూసి తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వారిని చూసి స్ఫూర్తి పొందడం జరుగుతుంది. నీ ముందు సీనియర్లు ఉంటే వారిని మెప్పించేలా నటించాలనే కోరిక కలుగుతుంది. దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగన్, టబుతో కలిసి నటించడం గొప్ప అనుభవం అని రకుల్ చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: