గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాగార్జున ప్రస్తుతం తాను నటిస్తున్న ‘మన్మధుడు 2’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీకి సంబంధించిన షూటింగ్ గత నెలరోజులుగా పోర్చుగల్ లో నిర్విరామంగా జరుగుతోంది. ఈషెడ్యూల్ తోనే ఈమూవీకి సంబంధించిన 70 శాతం పనులు పూర్తి అవుతాయి అని తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ దర్శకుడు ఈసినిమా విడుదలకు సంబంధించి నాగార్జునకు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ఏమాత్రం నచ్చలేదు అని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈమూవీని మరింత వేగంగా పూర్తి చేసి ఈసినిమాను రాబోతున్న ఆగష్టు 15న విడుదల చేద్దామని సూచించినట్లు తెలుస్తోంది. 

అయితే ఈసూచనకు నాగార్జున అంగీకరించలేదు అని వార్తలు వస్తున్నాయి. ఆగష్టు 15న ప్రభాస్ ‘సాహో’ విడుదలకు అన్నివిధాల రెడీ అవుతున్న నేపధ్యంలో ‘సాహో’ ఈమూవీ మ్యానియా ముందు ‘మన్మధుడు 2’ ఏమాత్రం నిలబడలేదని నాగ్ అభిప్రాయం అని తెలుస్తోంది. దీనితో  ‘మన్మధుడు 2’ మూవీని జూలై చివరి వారంలో విడుదల చేయడానికి ఒక ప్రాధమిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


ఈయాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా ఈసినిమాకు సంబంధించిన అన్ని పనులను వేగంగా పూర్తిచేసే విధంగా నాగ్ సలహాలతో రాహుల్ రవీంద్రన్ అడుగులు వేస్తున్నట్లు టాక్. నాగార్జున కెరియర్ లో ఒక మైల్ స్టోన్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసిన ‘మన్మధుడు’ కు సీక్వెల్ గా రాబోతున్న ‘మన్మధుడు 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో ఈసినిమాను ఎలాగైనా హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీకి ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ను పెట్టి నాగార్జున ఎప్పటికీ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మన్మధుడు మాత్రమే అన్న విషయాన్ని మరొకసారి గుర్తుకు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగమే ‘మన్మధుడు 2’..   



మరింత సమాచారం తెలుసుకోండి: