మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. 96 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన మహర్షి అన్నిచోట్ల తొలి వారాంతరం లోగా బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓవర్సీస్ లో మహర్షి అనుకున్న విధంగా వసూళ్లు రాబట్టడం లేదు. అయితే నిన్న సక్సెస్ మీట్ లో నాన్ బాహుబలి రికార్డులను మహర్షి బీట్ చేస్తుందని నమ్మకంగా చెప్పారు దిల్ రాజు.


ఇక ఇదిలా ఉంటే మహర్షి సినిమా తన కథను కాపీ చేశారని అంటున్నాడు దర్శకుడు శ్రీవాస్. తను దిల్ రాజుకి చెప్పిన ఓ లైన్ తోనే మహర్షి కథ రాసుకున్నారని.. అయితే తన లైన్ వాడుకుంటున్నట్టుగా తనకు చెప్పలేదని అన్నాడు శ్రీవాస్. ఈ విషయాన్ని వివాదం చేయకుండా శ్రీవాస్.. నిర్మాత దిల్ రాజుతోనే ఆర్గ్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీవాస్ చెప్పిన లైన్ నచ్చి దాన్ని వంశీకి చెబితే మహర్షి సినిమా తీశారని తెలుస్తుంది.  


అయితే ఈ విషయంపై శ్రీవాస్ దర్శకులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేయట్లేదట. ఎందుకంటే మహర్షి ఛాన్స్ మిస్సైనా మరో భారీ సినిమా అవకాశం శ్రీవాస్ కు ఇస్తున్నాడట దిల్ రాజు. మరి కేవలం శ్రీవాస్ లైన్ మాత్రమే వాడారా లేక మొత్తం సీన్స్ కూడా అతని రాసినవేనా అంటూ ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా క్రియేటివ్ ఫీల్డ్ లో ఇలాంటివి కామన్. వంశీ పైడిపల్లి 3 ఏళ్లు కష్టపడి తీసిన సినిమా మహర్షి.


సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సినిమా రెండు రోజుల్లో 45 కోట్ల వరకు షేర్ రాబట్టింది. శని, ఆదివారాల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే మహేష్ మహ్ర్షి బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. పోటీగా స్టార్ సినిమాలేవి లేవు కాబట్టి మొత్తానికి మహర్షి చెప్పుకున్నట్టుగానే మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: