టాలీవుడ్ లో ఒకప్పుడు అంకుశం, ఆహుతి లాంటి యాక్షన్ సినిమాల్లో నటించి యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ కొంత కాలం తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించారు.  తన సహనటి జీవితను వివాహం చేసుకున్న రాజశేఖర్ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా క్రేజ్ తీసుకు రాలేక పోయాయి.  అంతే కాదు ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్ కావడంతో కొంత కాలం సినిమాకు దూరంగా ఉంటూ వచ్చారు.
‘గరుడవేగ’లాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ తానేంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. 

ఈ సినిమా అనుకున్నదానికన్నా ఎక్కువే సక్సెస్ కావడంతో ఇక వరుస సినిమాలపై ఫోకస్ పెట్టారు రాజశేఖర్.  ఇకప్పుడు టాలీవుడ్ లో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలు ఎక్కువగా చేసింది రాజశేఖర్..అందుకే గరుడవేగ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గానే నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 


తాజాగా మరోసారి పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా మూవీ నిర్మితమైన 'కల్కి' ఈ నెల 31వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. అప్పుడే ఈ సినిమా ట్రైలర్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.  ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుందని సమాచారం. 


తాజాగా ఈ సినిమా విశేషాల గురించి రాజశేఖర్ మాట్లాడుతూ..ఈ కథ తీసుకుని ప్రశాంత్ వర్మ నా దగ్గరికి వచ్చి కొత్తగా ట్రై చేద్దామని చెప్పారు..గతంలోనే చాలా ఫెయిల్యూర్స్ చూసిన నేను మరోసారి ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలంటే కాస్త భయం అనిపించింది. 

 కానీ ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ తెచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాత నా టెన్షన్ తగ్గిపోయింది. ముఖ్యంగా 'ఏం సెప్తిరి .. ఏం సెప్తిరి' అంటూ నా మేనరిజాన్ని నేనే అనుకరించడం జనంలోకి బాగా వెళ్లింది. సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం మరింత పెరిగింది  అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: