యంగ్ హీరోయిన్స్ హవా పెరిగి పోవడంతో ఛార్మీకి అవకాశాలు లేకపోవడంతో నిర్మాతగా మారిపోయింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తున్న ఛార్మీ నిర్మాతగా కూడ ఫెయిల్ అయినప్పటికీ ఇంకా ధైర్యంగా ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఈమె రామ్ హీరోగా నిర్మిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఈమూవీ టోటల్ రైట్స్ ను 20 కోట్లకు తీసుకుంటానని ముందుకు రావడమే కాకుండా ఎగ్రిమెంట్ పూర్తి చేసుకున్న తరువాత 10 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తానని చెప్పినా ఛార్మీ తిరస్కరించింది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు ఈమూవీ నిర్మాణం పూర్తి అయిన తరువాత మాత్రమే ఈమూవీ రైట్స్ అమ్మకం గురించి ఆలోచిస్తాను అంటూ ఛార్మీ చెప్పినట్లుగా వస్తున్న లీకులు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి.

వాస్తవానికి ప్రస్తుతం పూరికి కొనసాగుతున్న నెగిటివ్ ట్రాక్ అదేవిధంగా రామ్ ను వెంటాడుతున్న ఫెయిల్యూర్ ల మధ్య ఈమూవీకి ఈ స్థాయిలో ఆఫర్ రావడమే చాల కష్టమైనా పని. రామ్ సినిమాలకు ఓపెనింగ్స్ కూడ సరిగ్గా రాకపోతున్న నేపధ్యంలో ఇలాంటి ఆఫర్ ను ఛార్మీ ఎందుకు వదులుకుంది అన్న కొనమలో ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 

అయితే మరికొందరు ఈవిషయమై మరోవిధంగా స్పందిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు బయ్యర్లు దొరకడం లేదు అంటూ గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో వార్తల హడావిడి చేస్తున్న నేపద్యంలో ఆ వార్తలకు చెక్ పెట్టడానికి ఛార్మీ పూరీలు వ్యూహాత్మకంగా ఇలాంటి 20 కోట్ల తిరస్కరణ వార్తలను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: