మెగా కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన సాయి ధరమ్ తేజ్ కి ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్టు సినిమా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చిత్రలహరి సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న లేకపోయింది. ఈ నేపథ్యంలో సాయి ధరంతేజ్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ టాక్.
ముఖ్యంగా మహానుభావుడు సినిమా తర్వాత చేసిన సినిమా శైలజా రెడ్డి దారుణంగా ఫ్లాప్ అవడంతో డైరెక్టర్ మారుతీ తో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఆలోచించడం జరిగింది. ఇటువంటి క్రమంలో సాయి ధరంతేజ్ మారుతితో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఇటీవల డైరెక్టర్ మారుతీ కంప్లీట్ చేసినట్లు...ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దినట్లు సమాచారం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు తండ్రిగా రావు రమేష్ నటించబోతున్నాడట. ఇటీవల రావు రమేష్ చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇటువంటి క్రమంలో మెగా హీరోకి రావు రమేష్ తండ్రి గా నటించడం సినిమాకి హైలెట్ అవుతుందని అంటున్నారు సినిమా విశ్లేషకులు.