తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితుడు..ప్రముఖ నటి సీత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్తీబన్ పై హత్యయత్నం కేసు నమోదయ్యింది.  సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.  తెలుగు, తమిళ సినిమాల్లో పార్తీబన్ ఒకప్పుడు విలన్, హీరోగా నటించారు.  ఆ సమయంలోనే ప్రముఖ నటి సీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీరి కూతురు తులసి కూడా ఓ సినిమాలో నటించింది.  కొంత కాలం తర్వాత వీరి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.


ప్రస్తుతం తండ్రి, మామ పలు క్యారెక్టర్ పాత్రల్లో నటిన్నారు పార్తీబన్.  తాజాగా తమిళనాడు లో ఆయనపై మర్డర్ కేసు నమోదు అయ్యింది.  మర్డర్ కేసు విషయానికి వస్తే జయరాం అనే వ్యక్తిని పార్తీబన్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయట. వాస్తవానికి పార్తీబన్ వద్ద జయరామ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో నమ్మకంగా పని చేస్తున్నట్లు సమాచారం.


ఆర్ధిక లావాదేవీల విషయంలో గొడవ జరగడంతో జయరాం పై దాడికి పాల్పడ్డాడు పార్తిబన్ . ఇంకేముంది నన్ను చంపబోయాడు అంటూ పార్తీబన్ పై కేసు పెట్టాడు జయరాం . ప్రస్తుతం పార్తీబన్ ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే జయరాం కథనం ఒకలా ఉండగా పార్తీబన్ మాత్రం ఎవరో నాపై కుట్ర చేస్తున్నారు అందుకే ఇలా కేసు పెట్టించారు అని అంటున్నాడు . తాజాగా పార్తిబన్ ని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: