సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో మేగా ఫ్యామిలీ నుంచి వచ్చిన శిరీష్ కూడా ఒకరు. ఒక్క ‘శ్రీరస్తు శుభమస్తూ’ సినిమా తప్పితే మంచి హిట్ ఒక్కటి లేదనే చెప్పుకోవాలి. దీనితో శిరీష్ ఆశలన్నీ అతని కొత్త సినిమా 'ఎబీసిడీ'(అమెరికా బోర్న్ కన్ ఫ్యూజ్ద్ దేశి) మీదే పెట్టుకున్నాడు.


ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, ఇప్పటికే ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి. ప్రతి సినిమాకు ప్రీ-రిలీజ్ ఈవెంట్ పెట్టడం సంప్రదాయంగా మారిపోయింది. కాబట్టి ఈ సినిమాకి కూడా మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ను నిర్ణయించారు. ఈ నెల మే 13వ తేదిన సాయంత్రం 6 గంటలకు ఫిలింనగర్ లో ఈవెంట్ జరగనుంది. విశేషం ఏంటంటే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నాడు.


నాని వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు. మొన్న వచ్చిన జెర్సీ సినిమా అతని కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. ఆ సినిమాలో నాని యాక్టింగ్ ను పలువురు మెచ్చుకున్నారు. జెర్సీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యూత్ ని ఇన్స్పిరేషన్ చేసే కధాంశంతో నాని అందరి మనసులని దోచుకున్నాడు. ఈ ఇంపాక్ట్ ఆడియన్స్ పై ఇంకా ఉంది, అందుకనే అల్లు శిరీష్ కొత్త సినిమా ఈవెంట్ కి స్పెషల్ గా ఆహావనం పలికినట్లుగా వినికిడి.


జెనరల్ గా మెగా ఫ్యామిలీ సినిమా అంటే మెగా ఫ్యామిలీ సెలెబ్రిటిలను చీఫ్ గెస్ట్ గా అనుకుంటాం కానీ అందుకు బిన్నంగా మేకర్స్ నాని ని ఎంచుకున్నారు. ఈ విషయాన్నీ అధికారికంగా ఒక పోస్టర్ తో చెప్పకనే చెప్పారు ABCD టీం. ఈ సినిమాలో అల్లు శిరీష్ పక్కన రుక్సార్ ధిల్లాన్ అనే కొత్త హీరోయిన్ నటించింది. ఈ మే 17వ తేదిన సినిమా విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: