ఈ నెల మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘మహర్షి’మూవీ అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది.  ఈ సినిమా విజయానికి సంతోషంగా నేడు హైదరాబాద్ లో నోవాటేల్ హూటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు ‘మహర్షి’టీమ్.  ఈ సందర్భంగా మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.  ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో తన తండ్రి అభిమానులు, తన అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగే సినిమా ఇది అవుతుందని దర్శకుడు వంశీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.


సాధారణంగా ఏ కార్యక్రమంలో అయినా తన న్యాచురల్ వర్డ్స్ తో మహేష్ ఎట్రాక్ట్ చేస్తుంటాడు. తన కెరీర్ లో ఎంతో విజయవంతమైన చిత్రాలను ఈ మూవీ అధిగమించబోతోందని అన్నారు. నేడు నిర్వహించిన సక్సెస్ మీట్ లో కూడా మహేష్ గర్వంతో కాలర్ ఎగరేయడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.మహేష్ మాట్లాడిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఈ డైలాగ్ ని తెగ షేర్ చేసుకుంటున్నారు.  


మహర్షి మూవీ ఆయనకు 25 సినిమా అందుకే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా ఘన విజయానికి పునాది వేశారు.  ఈ సక్సెస్ మీట్ లో మహేష్ - వంశీ పైడిపల్లితో పాటు చిత్ర నిర్మాతలు  అలాగే అల్లరి నరేష్, పోసాని కృష్ణ మురళి వంటి ప్రముఖ టులు పాల్గొన్నారు. మొత్తానికి మహేష్ బాబు కెరీర్ లో కాదు ఆయనను అమితంగా అభిమానించే అభిమానులు కూడా కాలర్ ఎత్తుకునేలా చేసిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: