టాలీవుడ్ టాప్ హీరో సూపర్స్టార్ కృష్ణ కొడుకు ప్రిన్స్ మహేష్బాబు. బాలీవుడ్,ఇటు టాలీవుడ్లో మంచి టాప్ లో హీరోయిన్గా కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే మహేష్ నమ్రతా ప్రేమలో పడ్డారు. ఆతర్వాత ఇద్దరు పెళ్ళి చేసుకున్నాక పూర్తిగా ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇటీవలె ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహేశ్ కెరీరే తనకు ముఖ్యమని చెప్పారు.తాను మహేశ్ సినిమాలను అసలు చూడనని... ఆయన సినిమాలు తనను చాలా ఒత్తిడికి గురి చేస్తాయని తెలిపారు.
అందరిలాగానే తమ కుటుంబసభ్యులు మహేశ్ సినిమా ప్రివ్యూలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారని... తాను మాత్రం ఇంట్లో కూర్చొని, గోళ్లు కొరుకుతూ, సినిమా హిట్ కావాలని భగవంతుడిని ప్రార్థిస్తుంటానని నమ్రత చెప్పారు.
గత సినిమాల కంటే ఈ సినిమా బాగుంటుందా? లేదా? అని ఆలోచిస్తుంటానని... ఇది ఎంతో టెన్షన్ కు గురి చేస్తుంటుందని అన్నారు. అయితే, ఎప్పుడూ హ్యాపీగా ఉండమని మహేశ్ చెబుతుంటాడని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల భార్యలు ఎక్కువగా చేసే పని ఇది. వాళ్ళు సక్సెస్ కావాలని వాళ్ళ సక్సెస్ వెంటే ఉంటున్నారు.