తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ.  ఇప్పటి వరకు వంద చిత్రాలకు పైగా నటించిన ఆయన ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  కానీ ఇది అనుకున్న స్థాయిలో విషయం సాధించలేక పోయింది.  గత నెలలో ఏపిలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో హిందూపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు.  గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన హిందూపూర్ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. 

తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో ఉన్న లోవ వద్ద తలుపులమ్మ అమ్మవారి అత్యంత ప్రాచీన ఆలయం ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ఈ ఉదయం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆలయ అధికారులు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. ఆచార సంప్రదాయాలను అనుసరించి బాలయ్యను ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. తమ అభిమాన హీరో వచ్చారని తెలుసుకున్న బాలయ్య అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: