ప్రముఖ నిర్మాత బి. నాగిరెడ్డి డిసెంబర్ 2, 1912న కడప జిల్లా, కొండాపురం మండలంలోని పొట్టిపాడు గ్రామంలో జన్మించారు. యువకుడుగా ఆయన స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో
పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం బర్మా వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం
పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు.
క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా చందమామ ఆవిర్భావం జరిగి దినదినప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.
నాగిరెడ్డి గారి కుమారులే వెంకట్రామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి. బి. నాగిరెడ్డి గారి కుమారుడు వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విశాల్, అజిత్, విజయ్, ధనుష్లతో పాటు, ఇతర నటీనటులతో పలు సినిమాలు తీశారు.
అలనాటి ప్రముఖ నిర్మాత బి. నాగిరెడ్డి శతయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన కుమారులు వేణుగోపాల్రెడ్డి, వెంకట్రామిరెడ్డి భారీ ఎత్తున ప్రతీ ఏటా నాగిరెడ్డి శతజయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రాలకు నాగిరెడ్డి స్మారక పురస్కారం ఇవ్వడం సంప్రదాయంగా మారింది.
ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఏటా పురస్కారాలను అందిస్తున్నారు. సోమవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల పలువురు సనీ ప్రముఖులు సంతాపం తెలిపారు.