సినిమాల్లో హీరోలు ఎంత బిజీగా ఉన్నా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తమ స్నేహితులు, తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.  ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ డే, వాలైంటేన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే రోజున సెలబ్రెటీలు తమవారితో గడుపుతుంటారు.  ఇక షూటింగ్ లతో బిజీ గా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా సరే అమ్మ సంతోషం కోసం కొంత సమయం కేటాయిస్తుంటారు.  కానీ ఈ మద్య షూటింగ్ బిజీలో తన తల్లిని కలవడానికి సమయం చిక్కడం లేదట.. ఈసారి మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లిని కలిసి చాలా సమయం గడపాలని నిశ్చయించుకున్నారట జూ. ఎన్టీఆర్. 

అనుకున్నదే తడవు ఎన్టీఆర్ మాతృదినోత్సవం కంటే ముందే తన తల్లికి సంతోషాన్ని పంచాడు. ఎన్టీఆర్ తల్లి షాలిని అన్న విషయం తెలిసిందే . అయితే ఆమె తరుపు బంధువులు అంతగా సినిమావాళ్ళకు తెలియదు. అయితే ఈసారి ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన తల్లి షానిలి బంధవులందరికి షాక్ ఇచ్చారు.  ఆమె బంధువుల ఇళ్లలోకి వెళ్లి ఆశ్చర్యానికి గురిచేశాడు ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి భార్య , పిల్లలతో కలిసి తల్లి బంధువుల ఇళ్లలోకి వెళ్లడంతో వాళ్ళ సంతోషానికి అవధులే లేకుండాపోయాయి.

చాలా కాలం తర్వాత తన కొడుకు చూపించే ఆప్యాయత..తన బంధువులను కలుసుకోవడం షాలిని గారి సంతోషాం మాటల్లో చెప్పలే పోయారట. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ గ్యాప్ రావడంతో ఇలా జూనియర్ తన తల్లి కోసం కర్ణాటక టూర్ ప్లాన్ చేసాడు అన్నమాట . జూనియర్ ఎన్టీఆర్ తన బంధుమిత్రులతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: