సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ మే 9న రిలీజైన సినిమా మహర్షి. మొదటిరోజు నుండి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా సినిమా సక్సెస్ మీట్ ను ఈరోజు జరుపుకున్నారు. సినిమా నటీనటులంతా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సక్సెస్ మీట్ లో భాగంగా అల్లరి నరేష్ ఎమోషన స్పీచ్ అందరిని ఆకట్టుకుంది.


మా పాప పుట్టిన రెండో వారం వంశీ గారు ఈ సినిమా గురించి కాల్ చేశారని.. తర్వాత కలిసి ఓ 20 నిమిషాలు నరేషన్ ఇచ్చారని.. మహేష్ బాబు సినిమాలో అవకాశం అంటే ఏదో కామెడీ రోల్ అనుకున్నా కాని సీరియస్ రోల్ ఇచ్చారు. ఈ పాత్రలో తాను నటిస్తానని నమ్మినందుకు వంశీ పైడిపల్లికి, మహేష్ గారికి థ్యాంక్స్ అన్నాడు నరేష్.


ఇక ఇప్పుడు తన తండ్రి బ్రతికి ఉంటే చాలా సంతోషించేవారని.. ఎందుకంటే ఆయన డైరక్టర్ అవడానికి ముందు రైతు అని.. రైతుగా గర్వపడేవారని అన్నారు నరేష్. చాలా సినిమాలు చేస్తాం డబ్బు, పేరొస్తుంది కాని కొన్ని సినిమాలు చేస్తే గౌరవం వస్తుంది. మహర్షితో నాకు అదే వచ్చింది. వైజయంతి మూవీస్ లో చేయాలని ప్రతి ఆర్టిస్ట్ కల అది మహర్షితో నెరవేరింది. 


అంతేకాదు దిల్ రాజు, పివిపి బ్యానర్ లో సినిమా చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇక మహేష్ గురించి ప్రస్తావిస్తూ సీన్ కు తగ్గ మూడ్ మెయింటైన్ చేస్తుంటారు మహేష్. చిన్న రియాక్షన్ ను కూడా పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటారు. అందుకే పర్ఫెక్ట్ కు ఆయన నిదర్శనం అని అనాడు నరేష్. ఇక హిట్టు మాట విని తను 4 ఏళ్లు అయ్యిందని మహర్షితో అది నెరవేరిందని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: