టాలీవుడ్ లో ఇప్పుడు మంచి జోరుమీద ఉంది బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డె. టాలీవుడ్ లోకి ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. దాంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పెద్దగా సక్సెస్ సాధించలేదు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం సినిమాతో పూజా హెగ్డే అదృష్టం మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు వస్తున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత, వంశి పైడిపల్లి-మహేష్ బాబు నటించిన ‘మహర్షి’మూవీలో ఛాన్సు దక్కించుకుంది. ఇక మహర్షి మూవీ హిట్ కావడం..బాక్సాఫీస్ షేక్ చేయడం జరుగుతుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. నేడు హైదరాబాద్ లో నోవాటేల్ హోటల్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు, వంశి పైడిల్లి చాలా ఎమోషనల్ గా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడారు. నేనే గనక ఆడపిల్ల అయితే..మహేష్ బాబు లాంటి అందగాడి వెంట పడి మారీ పెళ్లి చేసుకోమని అడిగేవాడిని. అంతే కాదు మహేష్ బాబు అందం ముందు పూజా హెగ్డె వెల వెల పోయిందని అన్నారు. మే 9 న విడుదలైన మహర్షి మంచి వసూళ్ల నే సాధిస్తోంది . అయితే దురదృష్టమో లేక గ్రహబలమో కానీ పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ ఇంతవరకు బ్లాక్ బస్టర్ లు కాలేకపోయాయి పాపం .