‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో ఒకేసారి వెలుగులోకి వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి నాగచైతన్యతో ‘మహాసముద్రం’ అన్న టైటిల్ తో ఒక మూవీని తీయడానికి ఆమూవీలో సమంతను నటింపచేసేలా ఒప్పించడానికి జరిగిన ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. ఈమూవీ ప్రస్తుతం చైతన్య నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే మొదలవుతుంది అన్న లీకులు కూడ వచ్చాయి,

ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడు చైతు అజయ్ భూపతిల మూవీ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్న ప్రచారం జరుగుతోంది. దీనికికారణం రవితేజ అని అంటున్నారు. ఈమధ్య కాలంలో వరస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ దృష్టి అజయ్ భూపతి పై పడినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే వీరిద్దరి మధ్య రెండు సమావేశాలు జరగడమే కాకుండా ఒక పవర్ ఫుల్ స్క్ర్పిట్ ను తనకోసం తయారుచేయమని రవితేజ అజయ్ భూపతిని అడిగినట్లు టాక్. ప్రస్తుతం మాస్ మహారాజ నటిస్తున్న ‘డిస్కో రాజ’ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత వెంటనే అజయ్ భూపతి మూవీని రవితేజ మైత్రిమూవీస్ బ్యానర్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో నాగచైతన్య ‘మహాసముద్రం’ ఆగిపోయిందా అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే వాస్తవ విషయాలు వేరు అని అంటున్నారు. చైతన్యతో అజయ్ భూపతి తీయాలి అనుకున్న ‘మహాసముద్రం’ మూవీకి కథ రీత్యా సుమారు 50 కోట్ల వరకు బడ్జెట్ అవసరమైన పరిస్థుతులలో ప్రస్తుతం చైతన్య మార్కెట్ రేంజ్ ఆరీతిలో లేకపోవడంతో ఆసినిమా ఆగిపోయి మరొక మాస్ మసాలా కథతో అజయ్ భూపతి రావితేజాతో మూవీ తీస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: