టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ నటిస్తోంది. గత‌ కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు 'పోర్చుగల్' లో జరుగుతోంది. నిన్నటితో అక్కడి షెడ్యూల్ పూర్తయింది. ప్రధాన పాత్ర‌ల షూటింగ్ మొత్తం   కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.


తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో సమంత .. కన్నడ బ్యూటీ అక్షర గౌడ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

రొమాంటిక్ హీరోగా నాగార్జునను మరోసారి పరిచయం చేయనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.  అప్ప‌ట్లో మ‌న్మ‌ధుడు చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. మ‌రి ఈ చిత్రం కూడా ఏ మాత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌కుండా ఉండాల‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: