ఈ సంవత్సరం హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘మహర్షి’. వంశి పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన ‘మహర్షి’చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది.  ఓవర్సీస్ లో మొదటి రోజు పెద్దగా రాణించకున్నా నెమ్మదిగా అక్కడ కూతా సత్తా చాటుతుంది. 

ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా తన సత్తా చాటుకుంటోంది.  


ఇక అన్ని ఏరియాల్లో ఓ రేంజ్ లో కలెక్షన్లు కొనసాగుతుంటే.. నైజామ్ ఏరియాలో కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి.  ఇక్క 16.61 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇంతవరకూ ఒక్క 'బాహుబలి 2'కి మాత్రమే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

ఇక  ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా 'గుంటూరు' లో 5.90 కోట్ల షేర్ ను .. కృష్ణా లో 3.60 కోట్ల షేర్ ను .. 'నెల్లూరు'లో 1.74 కోట్ల షేర్ ను రాబట్టింది. మహేశ్ బాబు కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: