ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా ఏదన్నా చిత్రంలో నటించాలంటే కొంత సమయం తీసుకుని ఆలోచించి చెపుతారు. కానా నా విషయంలో అలా జరగదంటుంది పంజాబీ భామ రకుల్ప్రీత్ సింగ్. 'ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఆ సినిమాలో నటించొచ్చా లేదా అనేది కేవలం ఐదు నిమిషాల్లోనే ఆలోచించి తేల్చేస్తానంటుంది.
ఎటువంటి విషయంలోనైనా సరే నేను మొదటి నుంచి అంతే.. ఏ విషయాన్నయినా పెద్దగా నాన్చను. వెంటనే నిర్ణయం తీసుకుంటానంటోంది. నాకు కొంత సమయం ఇవ్వండి ఆలోచించి చెబుతాను. అలాంటివన్నీ నా దగ్గర ఉండవు. చిటికలె ఆలోచించి చటుక్కున నిర్ణయం తీసుకుంటా అని చెప్పింది రకుల్.
ఇటీవలె తన తమ్ముడు రెండో సినిమాను అంగీకరించాడంటూ రకుల్ ప్రీత్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చాలా ఆనందంగా ఉంది. తొలి సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే రెండో ప్రాజెక్ట్ను అంగీకరించినందుకు అమన్కు అభినందనలు. నువ్వు నన్ను గర్వపడేలా చేశావ్. లవ్ అండ్ లక్ టు యు’ అని రకుల్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.
అమన్ ఇప్పటికే దాసరి లారెన్స్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈనెల 24న ప్రారంభమైంది. మహూర్తపు సన్నివేశానికి రకుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా.. హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో విలక్షణ నటుడు రావు రమేష్ సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.