తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి నెంబర్ వన్ రేసులోకి వెళ్లింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సమంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఏం మాయ చేసావే చిత్రంలో నటించిన తన సహనటుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పైళ్లైన తర్వాత సమంత వరుస విజయాలు అందుకుంటుంది. ఈ మద్య చైతూ-సమంత జంటగా నటించిన ‘మజిలీ’చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తాజాగా మాతృదినోత్సవం సందర్భంగా ఆమె తన తల్లి ఫోటో షేర్ చేసింది. తన తల్లి నినెట్ ప్రభు ఔన్నత్యాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. చిన్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా వెళ్లి చూసేదానినని ఆమె ప్రార్థనలో ఎంతో పవర్ ఉంటుందని అన్నారు. అందుకే చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్లి.. ‘అమ్మ నా కోసం ప్రార్థించు’ అని అడిగేదాన్ని.
ఇప్పటికీ నేను ఆమె దగ్గరికి అలానే వెళ్తుంటా. ఆమె కోరుకుంటే అన్నీ జరుగుతాయని నా నమ్మకం. మా అమ్మలోని మరో ఉత్తమమైన గుణం ఏంటంటే, ఆమె ఏ రోజూ తన కోసం తను ప్రార్థించలేదు. దేవుడి తర్వాత అమ్మే. లవ్ యు అమ్మా అని సమంత పోస్ట్ పెట్టింది. తాజాగా ఈ ఫోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.