తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’చిత్రంతో కనీ వినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకున్నారు.  ఈ సంవత్సరం అవార్డు చిత్రం నామినేట్ అయ్యేదాని లో నెంబర్ వన్ స్థానంలో మహర్షి ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

తాజాగా మహర్షి చిత్రం పూర్తి చేసుకున్న మహేష్ బాబు ‘ఎఫ్ 2’ చిత్రం తో మంచి సక్సెస్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.  అయితే ఇప్పటికే అనీల్ రావిపూడి వరుసగా నాలుగు హిట్ చిత్రాలు అందుకున్నాడు.  దాంతో ఆయనకు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో మూవీ చాన్స్ వచ్చింది.  అయితే ఈ చిత్రం కోసం అతడికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి.కాకపోతే  ఎంత పారితోషికం అన్న విషయంపై రక రకాల వార్తలు వచ్చినా..తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

నిర్మాతలు అతడికి పది కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట. ఇక మహేష్ బాబుకి దాదాపు రూ.50 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం దర్శకుడు, హీరోల రెమ్యునరేషన్లకే అరవై కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇది అనీల్ రావిపూడికి చాలెంజింగ్ అనే చెప్పాలి. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: