నందమూరి బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కే సినిమాపై గ‌త వారం రోజులుగా ఇండ‌స్ట్రీలో అనేక వార్త‌లు విన‌ప‌డుతున్నాయ్‌. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సీ క‌ళ్యాణ్ నిర్మించే ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న హ‌రిప్రియ ఓ హీరోయిన్ అని... లేడీ విల‌న్‌గా కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ శ‌ర‌త్‌కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టిస్తోంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ఇప్ప‌టికే ఇదే కాంబోలో గ‌తేడాది సంక్రాంతికి జై సింహా సినిమా వ‌చ్చి హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌పై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయ్‌. ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే హ‌రిప్రియ‌తో పాటు మ‌రో హీరోయిన్ కూడా ఉంటోంద‌న్న టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇక ఈ సినిమాపై జ‌రుగుతోన్న ప్ర‌చారాల‌కు నిర్మాత క‌ళ్యాణ్ ఫులిస్టాప్ పెట్టేశారు. వరలక్ష్మి తమ సినిమాలో చేయట్లేదని, ఇప్పటి వరకు జగపతిబాబును మాత్రమే తీసుకున్నామని చెప్పారు. ఈ నెలలోనే లాంచ్ కానున్న ఈ సినిమాకు 'రూలర్' అనే పవర్‌ఫుల్ టైటిల్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా త‌ర్వాత బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాను చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: