ఇప్పటికే ఇదే కాంబోలో గతేడాది సంక్రాంతికి జై సింహా సినిమా వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయ్. ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే హరిప్రియతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటోందన్న టాక్ కూడా బయటకు వచ్చింది.
ఇక ఈ సినిమాపై జరుగుతోన్న ప్రచారాలకు నిర్మాత కళ్యాణ్ ఫులిస్టాప్ పెట్టేశారు. వరలక్ష్మి తమ సినిమాలో చేయట్లేదని, ఇప్పటి వరకు జగపతిబాబును మాత్రమే తీసుకున్నామని చెప్పారు. ఈ నెలలోనే లాంచ్ కానున్న ఈ సినిమాకు 'రూలర్' అనే పవర్ఫుల్ టైటిల్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్లో బాలయ్య తన నెక్ట్స్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.