టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు శివశంకర్ మాస్టార్.  చిత్ర పరిశ్రమలో ఆయన సుదీర్ఘ కాలంగా  తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు.  ఆ మద్య ఓంకార్ యాంకరింగ్ చేసిన పలు డ్యాన్స్ రియాల్టీ షోలో జడ్జీగా వ్యవహరించారు. తాజాగా శివశంకర్ మాస్టార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను చిత్ర పరిశ్రమలో ఎలా కష్టపడి పైకి వచ్చారో చెప్పారు.

నృత్య దర్శకుడు సలీమ్ గారి దగ్గర నేను అసిస్టెంట్ గా చేరాను. ఒక ఏడాదిపాటు ఆయనతో షూటింగ్స్ కి వెళుతూ, అన్ని విషయాలను దగ్గరగా పరిశీలించేవాడిని. ఆ తరువాత ఒక తమిళ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యాను. ఇప్పటికీ నా ప్రయాణం 46 ఏళ్లు సాగింది..ఎంత కాలం ఉన్నామని కాదు..ఏం సాధించామన్నదే మనకు సంతృప్తిని ఇస్తుందని అన్నారు. 

ఆ నాటి నటుల నుంచి నేటి నటుల వరకు  కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ వెళ్లాలనే ఉద్దేశంతో ఉంటాను.   సినిమాలో అవకాశాలు రావడం లేదే అనే బాధతో చనిపోకూడదు..మన టాలెంట్ ఎక్కడ పనికి వస్తుందో అక్కడ రాణించాలని అన్నారు.  ఆ మద్య తన ఫ్యామిలీలో కొన్ని గొడవలు జరిగాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయన్న విషయంపై స్పందిస్తూ..తన కోడలి కారణంగా తాము పడుతోన్న కష్టాల గురించి వివరించారు. 

మా కోడలిని మేము ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. మా గురించి ఆమె చెబుతున్నదాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. మా కోడలే మమ్మల్ని నానా హింసలు పెట్టింది. ఆ పరమేశ్వరుడే అంతా చూసుకుంటాడని అనుకుంటున్నాను. 


మరింత సమాచారం తెలుసుకోండి: